ఛీ ఛీ.. ఇలాంటి వాడిని అసలు కొడుకంటారా?
ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఈ కోవలోకే చెందినది అని చెప్పాలి. ఏకంగా ఆస్తికోసం కనిపించిన తల్లిని దారుణంగా హత్య చేశాడు కొడుకు. కామారెడ్డి జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది. ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని గండి మాసానిపేటకు చెందిన లచ్చి పోచమ్మ కొడుకు సంజీవులు కోడలు సరిత ఇద్దరు మనవళ్ళతో కలిసి పూరిగుడిసెలో ఉంటుంది. అయితే వీరికి రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇటీవల కాలంలో ఏకంగా చెడు అలవాట్లకు బానిసగా మారిన సంజీవులు ఎంతోమంది దగ్గర అప్పులు చేశాడు.
మూడు నెలల క్రిందటే కొంత భూమిని విక్రయించి ఇక సంజీవులు చేసిన అప్పును తీర్చింది పోచమ్మ. అయితే మిగిలిన భూమిని కూడా అమ్మేద్దామని తరచూ తల్లితో గొడవ పడుతూ ఉండేవాడు సంజీవులు. కానీ పోచమ్మ మాత్రం భూమి అమ్మేందుకు ఒప్పుకోలేదు. దీంతో తల్లి బతుకు ఉన్నంతకాలం భూమి అమ్మటం కుదరదు అని భావించి చివరికి దారుణంగా మెడకు టవల్ చుట్టి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.