ఛీ ఛీ.. ఇలాంటి వాడిని అసలు కొడుకంటారా?

praveen
ఆస్తి అంతస్తులు కన్నా బంధాలు బంధుత్వాలు ఎంతో విలువైనవి అని ఎంతో మంది సూక్తులు చెబుతూ ఉంటారు.  కానీ నేటి రోజుల్లో వెలుగు లోకి వస్తున్న ఘటనలు చూస్తూ ఉంటే మాత్రం ఇలా ఎన్నో మాటలు చెబుతున్న వారే బంధాలకు విలువ ఇవ్వడం లేదు అన్నది తెలుస్తుంది. ఆస్తులు అంతస్తుల ముందు ఎలాంటి రక్త సంబంధమైన దిగదుడుపే అన్నదానికి  నిదర్శనంగా ఎన్నో తరహా ఘటనలు వెలుగు లోకి వస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఎందుకంటే ఆస్తులు కోసం ఏకంగా తల్లి దండ్రులు పిల్లలను చంపుతున్న ఘటనలు వెలుగులోకి వస్తూ ఉంటే ఇక మరోవైపు.. పిల్లలు కనిపించిన తల్లిదండ్రులను కూడా హతమారుస్తున్న ఘటనలు సభ్య సమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి.

 ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఈ కోవలోకే చెందినది అని చెప్పాలి. ఏకంగా ఆస్తికోసం కనిపించిన తల్లిని దారుణంగా హత్య చేశాడు కొడుకు. కామారెడ్డి జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది. ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని గండి మాసానిపేటకు చెందిన లచ్చి పోచమ్మ కొడుకు సంజీవులు కోడలు సరిత ఇద్దరు మనవళ్ళతో కలిసి పూరిగుడిసెలో ఉంటుంది. అయితే వీరికి రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇటీవల కాలంలో ఏకంగా చెడు అలవాట్లకు బానిసగా మారిన సంజీవులు ఎంతోమంది దగ్గర అప్పులు చేశాడు.

 మూడు నెలల క్రిందటే కొంత భూమిని విక్రయించి ఇక సంజీవులు చేసిన అప్పును తీర్చింది పోచమ్మ. అయితే మిగిలిన భూమిని కూడా అమ్మేద్దామని తరచూ తల్లితో గొడవ పడుతూ ఉండేవాడు సంజీవులు. కానీ పోచమ్మ మాత్రం భూమి అమ్మేందుకు ఒప్పుకోలేదు. దీంతో తల్లి బతుకు ఉన్నంతకాలం భూమి అమ్మటం కుదరదు అని భావించి చివరికి దారుణంగా మెడకు టవల్ చుట్టి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: