ప్రాణం తీసిన పెన్సిల్.. అసలేం జరిగిందో తెలుసా?
ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. సాధారణంగా ప్రతి విద్యార్థి జీవితంలో పెన్సిల్ అనేది ఒక భాగం అన్న విషయం తెలిసిందే. పెన్సిల్ తో డ్రాయింగ్ వేయడం లేదంటే హోంవర్క్ చేయడానికి ఉపయోగించడం లాంటివి ఎంతో మంది చేస్తూ ఉంటారు. అయితే ఇలా ఎంతోమంది రాసుకోవడానికి ఉపయోగించే పెన్సిల్ ప్రాణాలు కూడా తీసేస్తుంది అన్న విషయాన్ని మాత్రం ఎవరూ ఊహించరు అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా కఠిన జరిగింది. ఏకంగా పెన్సిల్ కారణంగా ఒక ఆరేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి.
ఈ విషాద కర ఘాటన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని అమీమ్ పూర్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. రాట్ అనే ప్రాంతంలో ఈ విషాదకర ఘటన జరిగింది. పెన్సిల్ పొట్టు గొంతులో చిక్కుకొని ఆరేళ్ల పాప చివరికి మృత్యువాత పడింది. ఆర్థిక అనే పాపా తన సోదరులతో కలిసి ధాబాపై హోంవర్క్ చేసుకుంటుంది. అయితే నోట్లో షార్ప్నర్ పెట్టుకొని పెన్సిల్ చెక్కుతూ ఉండగా పొట్టు ఆమె గొంతులో ఇరుక్కుంది. దీంతో ఊపిరాడక తీవ్ర ఇబ్బంది పడింది. ఈ క్రమంలోనే అప్రమత్తమైన తల్లిదండ్రులు స్పృహ కోల్పోయిన కూతురిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.