కామ కోరికల కోసం కన్నబిడ్డలని చంపిన "కసాయి ఆడది" !

VAMSI
క్షణిక సుఖాల కోసం ఈ సమాజంలో ఎన్నో నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి. ఒక్క కసనం మానవత్వంతో ఆలోచిస్తే ఎన్నో కాపురాలు, ఎంతోమంది పిల్లల జీవితాలు నిలబడుతాయి. రోజూ మనము ఇలాంటి ఘటనల గురించి వివిధ మాధ్యమాల ద్వారా తెలుసుకుంటూ ఉన్నాము. అలాంటి ఒక అమానుష ఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తమిళనాడు లోని కృష్ణగిరి జిల్లా ఒడంగట్టి గ్రామంలో ఈ సంఘటన జరిగింది. ఈ గ్రామానికి చెందిన మాదేశు మరియు జ్ఞానమలర్ లు భార్యాభర్తలు... వీరికి ఇద్దరు సంతానం ప్రకాష్ (3) మరియు ధీర (9 నెలలు) అనే పిల్లలు ఉన్నారు. మాదేశు ప్రతిరోజూ ఊర్లోనే ఏదో ఒక కూలి పనికి వెళ్ళేవాడు, మళ్ళీ ఎప్పుడూ సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేవాడు. జ్ఞానమలర్ ఒక్కటే పిల్లలతో ఇంట్లో ఉండేది.
అయితే అదే ఊరికి చెందిన సాయి తంగరాజ్ అనే వ్యక్తితో జ్ఞానమలర్ కు పరిచయం ఏర్పడింది. ఇక భర్త ఇంట్లో ఉండకపోవడంతో ఇద్దరూ ఒకరిని ఒకరు ఇష్టపడి అక్రమసంబందాన్ని పెట్టుకున్నారు. ప్రతి రోజూ భర్త అలా పనికి వెళ్ళగానే ప్రియుడితో రాసలీలల్లో మునిగితేలేవారు. అయితే ఈ విషయం ఎలాగో భర్తకు తెలిసి భార్యను మందలించాడు. కానీ భర్త మాటలను పెడచెవిన పెట్టింది.. పైగా తమ ఏకాంతానికి కన్నబిడ్డలు అడ్డుగా ఉన్నారన్న దురాలోచన తన మనసులో కలిగింది. జ్ఞానమలర్ మరియు సాయి తంగరాజ్ లు ఆ అభం శుభం తెలియని పసి పిల్లలను చంపడానికి నిర్ణయించుకున్నారు.
ప్రియుడు తంగరాజ్ చెప్పిన ప్లాన్ ప్రకారం పిల్లలకు ఎలుకల మందును తినే ఆహారంలో కలిపి పెట్టింది. దీనితో ఆ చిన్నారులు వాంతులు చేసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. అయితే ఇది గమనించిన పక్కింటివారు వారిని కృష్ణగిరి హాస్పిటల్ లో చేర్పించారు. కానీ చిన్న బిడ్డ అయిన అధీరా తట్టుకోలేక తన ప్రాణాలు విడిచాడు. దీనితో భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తంగరాజ్ మరియు జ్ఞానమలర్ లను అరెస్ట్ చేశారు. చూశారా ఎంత అమానుషమో ? తాళి బంధాన్ని మరిచి ? పేగు బంధాన్ని విడిచి ? కామం కట్టలు తెంచుకున్న వేల కటకటాల పాలయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: