మృగాడు పైశాచికత్వం: 2 ఏళ్ళ పసికందుపై దారుణంగా రేప్ !

VAMSI
మొన్న హైద్రాబాద్ లో జరిగిన 4 సంవత్సరాల స్కూల్ చిన్నారి అఘాయిత్యం గురించి ఇంకా మరిచిపోక ముందే, మరో హృదయ విదారక సంఘటన జరిగింది. దీనితో ఒక్కసారిగా మహిళాలోకం ఎంతో విచారంలో మునిగిపోయింది అని చెప్పాలి. మన దేశం ఎక్కడకు వెళుతోంది అన్నది అర్ధం కావడం లేదు. ముక్కుపచ్చలారని పసిపిల్లల నుండి వృద్ధ మహిళల వరకు ఎవ్వరినీ వదలకుండా రేప్ లు చేస్తున్నారు మృగాళ్లు. గుజరాత్ లో జరిగిన ఈ ఘోరం గురించి తెలిస్తే కన్నీళ్లు ఆపడం మన తరం కాదు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఈ ఊహించని ఘటన గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ లో జరిగింది. సూరత్ లో ఉంటున్న శోభదీప్ బాల్కిసన్(25) ట్రక్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.
ఇతను సోమవారం రోజు రెండు సంవత్సరాల పసికందును అనువ్రత్ ద్వార్ ప్లై ఓవర్ కింద ఉన్న స్లమ్ ఏరియా నుండి తీసుకు వెళ్ళాడు. అయితే పాపను ట్రక్ లో ఒకతను తీసుకువెళ్లాడని తల్లితండ్రులు వెంటనే అప్పుడే పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి చెప్పారు. వెంటనే అలెర్ట్ అయిన పోలీసులు చుట్టుపక్కల ఉన్న ఆరాలు అన్నిటినీ జల్లెడ పట్టగా ఆ ట్రక్ డ్రైవర్ ను పట్టుకున్నారు. అయితే అప్పటికే జరగకూడదు అనుకున్న ఘోరం జరిగిపోయింది, ట్రక్ లో ఆ రెండేళ్ల పాప తీవ్ర రక్తస్రావంతో స్పృహతప్పి పడిపోయింది. శోభదీప్ బాల్కిసన్ అనే నిందుతుడిని అరెస్ట్ చేసిన పోలీసులు అతనిపై ఐపీసీ సెక్షన్ ల కింద పలు కేసులు మరియు పోక్సో కేసులు నమోదు చేశారు.
ఆ పాపను వెంటనే సమీపంలో ఉన్న హాస్పిటల్ కు తరలించారు. ఒక మృగంలాగా ఆ చిన్న పాపై చూపించిన పైశాచికత్వానికి స్థానికులు మరియు తెలిసిన వారు నడిరోడ్డులో ఉరితీయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలో బాధ్యులైన నిందితులను బహిరంగంగా శిక్షిస్తేనే కొందరు అయినా వీరి బారి నుండి రక్షింపబడుతారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: