అన్యోన్య దంపతులు.. చావులోను ఒకరికి ఒకరు తోడునీడగా?
లింగంపేట మండలం శెట్పల్లి సంగారెడ్డి గ్రామంలో ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది అనే చెప్పాలి. గ్రామంలో నివాసం ఉంటున్న రాజయ్య (61)ఇటీవలే గుండెపోటుతో రావడంతో చివరికీ కుటుంబ సభ్యులు అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే మార్గ మధ్యములోనే మృత్యువాత పడ్డాడు. అయితే ఇన్నాళ్లు తనతోపాటే జీవితాన్ని పంచుకున్న భర్త ఇక లేడు అన్న విషయం లచ్చవ్వ (54)కు తెలిసింది. దీంతో అరణ్యరోదనగా విలపించింది. ఇక భర్త అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలోనే భార్య కు గుండెపోటు వచ్చింది. ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలోనే ఆమె సైతం ప్రాణాలు వదిలింది. ఆ దంపతులను చావు కూడా విడదీయ లేకపోయింది అంటూ స్థానిక ఇందుకు చర్చించుకుంటున్నారు.
అయితే కేవలం గంటల వ్యవధిలోనే తల్లిదండ్రులను కోల్పోయినా వారి పిల్లలు మాత్రం శోకసంద్రంలో మునిగిపోయారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే భార్యాభర్తలు ఇద్దరికీ కలిపి ఒకేసారి అంత్యక్రియలు నిర్వహించారు కుటుంబ సభ్యులు. ఎప్పుడు గొడవ పడకుండా ఎంతో అన్యోన్యంగా ఉండేవారని.. ఇక ఇప్పుడు చావు లోను కలిసి ప్రయాణం చేశారు అంటూ కుటుంబ సభ్యులు కూడా చెబుతూ ఉండటం గమనార్హం. ఇక వారి ఆత్మకు శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు.