అమ్మను చంపిన నాన్న.. కొడుకేం చేసాడో తెలుసా?

praveen
ఆధునిక సమాజంలో బ్రతుకుతున్న మనుషుల్లో పూర్తిగా మార్పులు వచ్చేసాయి. ఏకంగా బంధాలకు బంధుత్వాలకు అసలు విలువ ఇవ్వడం లేదు. ఒకప్పుడైతే పరాయివాళ్ళు ఎటు పోయినా పర్వాలేదు మనవాళ్లు క్షేమంగా ఉంటే చాలు అనే కాస్త స్వార్థపూరితంగా ఆలోచించేవారు మనుషులు. కానీ ఇప్పుడు మాత్రం ఏకంగా రక్తం పంచుకుని పుట్టిన వారి విషయంలో కూడా కాస్తయినా జాలి దయ చూపించడం లేదు. ఈ క్రమంలోనే సొంత వారి ప్రాణాలు తీస్తున్న నేపథ్యంలో సభ్య సమాజం మొత్తం అనుక్షణం భయపడుతూ బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్షణంలో ఎప్పుడు ఎవరు వచ్చి ప్రాణాలను తీసేస్తారో అంటూ భయపడిపోతున్నారు జనాలు.

 ఇక జనాల్లో ఇంత భయం కలగడానికి కారణం నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలే అని చెప్పాలి. ఇక ఇటీవలే ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో కూడా ఓ దారుణమైన ఘటన వెలుగు చూసింది. గతంలో తల్లి ని చంపేసాడు అన్న కోపంతో పగతో రగిలిపోతున్న కొడుకు.. పక్కా ప్లాన్ ప్రకారం సరైన సమయం చూసుకొని తండ్రిని దారుణంగా చంపేశాడు. కర్నూలు జిల్లా కోడుమూరు లో ఈ ఘటన వెలుగు చూసింది. అయితే కొన్ని నెలల క్రితం భార్యను చంపిన కేసులో పుల్లయ్య ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఇటీవలే జైలు శిక్ష పూర్తి కావడంతో పుల్లయ్య ఇంటికి వచ్చాడు.

 అయితే కన్న తల్లిని చంపి తనను ఒంటరి వాడిని చేశాడు అన్న కోపం కొడుకులో అలాగే ఉండిపోయింది. ఈ క్రమంలోనే జైలు నుంచి ఇంటికి వచ్చిన తండ్రిని చూసి కొడుకు బ్రహ్మ కోపంతో ఊగిపోయాడు. ఈ క్రమంలోనే అదును చూసి తండ్రి పై కత్తితో దాడి చేశాడు. తండ్రి చనిపోయాడు అని నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: