భార్యపై అనుమానం.. చివరికి కొడుకును చంపిన తండ్రి?

praveen
ఇటీవలి కాలంలో మనుషులు బంధాలకు బంధుత్వాలకు అసలు విలువ ఇవ్వడం లేదు. రక్త సంబంధాలను కూడా చేయకుండా  చివరికి ఏకంగా సొంత  వారి ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడడం  లేదు  నేటి రోజుల్లో  అని చెప్పాలి. చిన్న చిన్న కారణాలకు ఉన్మాదులు గా మారిపోతున్న మనుషులు సొంత వారి విషయంలో కాస్త అయినా జాలి దయ చూపించకుండా  దారుణం గా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి.

 సాధారణంగా తండ్రి అంటే పిల్లలకు ఏ కష్టం లేకుండా చూసుకుంటాడు. అల్లారుముద్దుగా చూసుకుంటూ పెంచి పెద్దచేసి ప్రయోజకులను చేస్తూ ఉంటాడు అనే విషయం తెలిసిందే. కానీ ఇక్కడ కన్న తండ్రి మాత్రం రక్తం పంచుకుని పుట్టిన కుమారుడు పైనే కిరోసిన్ పోసి నిప్పు పెట్టారు. ఈ ఘటన సంచలనం గా మారిపోయింది అని చెప్పాలి. తిరుపతి జిల్లా వడమాలపేట మండలం బట్టి కండ్రిగ హరిజనవాడ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. హరిజనవాడ కు చెందిన రమేష్ కు తన భార్యపై అనుమానం పెరిగి పోయింది. గత కొంతకాలం నుంచి వీరి మధ్య గొడవలు కూడా జరుగుతున్నాయి.

 ఈ క్రమంలోనే భార్య ఉదయం నుంచి కనబడక పోవడంతో ఇక తన మీద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడానికి వెళ్ళింది అని రమేష్ అనుకున్నాడు. దీంతో భార్య పై ఉన్న కోపాన్ని ఏకంగా కుమారుడిపై చూపించాడు. 9 ఏళ్ల కుమారుడు మహేష్ కు ఫినాయిల్ తాగించి అతన్ని హతమార్చే ప్రయత్నం చేశాడు. విషయం తెలుసుకున్న బాలుడు అమ్మమ్మ వెంటనే అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించింది. ఏం ప్రమాదం లేదు అంటూ చెప్పడంతో ఇంటికి తీసుకు వచ్చింది.  ఎంతకి భార్య  ఇంటికి రాకపోవడంతో కుమారుడిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. గమనించిన స్థానికులు మంటలను ఆర్పి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: