అతనితో శారీరక సంబంధం.. చివరికి ఇంటి వెనకాలే?

praveen
ఇటీవలే కాలంలో బంధాలు బంధుత్వాలు గురించి మర్చిపోతున్న మనుషులు సభ్య సమాజం తలదించుకునే విధంగా ప్రవర్తిస్తున్నారు అనే విషయం తెలిసిందే. మానవతా విలువలు మరచి పోయి క్షణకాల సుఖం కోసం చేయకూడని పనులన్ని చేసుకుంటూ ఉన్నారు. పడక సుఖం కోసం ఏకంగా కట్టుకున్న వారిని మోసం చేయడం.. ఏకంగా కడతేర్చటం లాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయని చెప్పాలి. ఇప్పుడు ఇలాంటి తరహా ఘటన జరిగింది. అదేవిధంగా ప్రియుడితో సుఖం కోసం కట్టుకున్న భర్తనే హతమార్చి తన పసుపు కుంకుమలను చేజేతులారా తెంపుకుంది ఓ భార్య.

 ఈ దారుణమైన ఘటన కామారెడ్డి జిల్లా లోని ఎల్లారెడ్డి పట్టణంలోని వెలుగులోకి వచ్చింది.  స్థానికంగా ఈ ఘటన హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. కర్ణాటకకు చెందిన రమేష్ అనే 26 ఏళ్ల యువకుడు తన భార్యతో కలిసి ఎల్లారెడ్డి పట్టణంలోని నూతనంగా నిర్మిస్తున్న భవనంలోకి వాచ్మెన్ గా పని చేస్తున్నాడు. ఈ దంపతులుఅంతకు ముందు వికారాబాద్ లో కూడా పనిచేసారూ. వికారాబాద్కు చెందిన దస్తప్ప తో సదరు మహిళకు పరిచయం ఏర్పడి కొన్నాళ్ళకే అక్రమ సంబంధంగా మారింది. విషయం ఇంట్లో తెలిసి  గొడవలు జరుగుతూ వస్తున్నాయి.

 ఈ కారణంగానే రమేష్ తన కుటుంబాన్ని మొత్తం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణానికి మార్చాడు. అయినా భార్య తీరులో మాత్రం మార్పు రాలేదు . ప్రియుడునీ ఎల్లారెడ్డికి రప్పించుకొని మరి శారీరక సంబంధాలు కొనసాగిస్తోంది. రమేష్ భార్యను ఎన్నోసార్లు హెచ్చరించినా ఆమె మాత్రం మారలేదు. చివరికి ఇక ప్రియుడితో సుఖానికి భర్త అడ్డు ఉన్నాడని భావించింది. తన ప్రియుడితో కలిసి పథకం వేసి భర్తను  దారుణంగా హత్య చేసి ఇంట్లోనే పూడ్చి పెట్టారు. ఆ తర్వాత ఒక ఫంక్షన్ కోసం కర్ణాటక వెళ్లగా.. అక్కడబంధువులు రమేష్ గురించి ఆరా తీశారు. ఆమె పొంతనలేని సమాధానం చెప్పింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: