తల్లి, కూతుర్ల మధ్య గాజు సీసాల ఫైట్..
వివరాల్లొకి వెళితే..మహబూబ్నగర్జిల్లా కేంద్రంలో జరిగింది. పట్టణ శివారులోని తిమ్మసానిపల్లిలోని అద్దె ఇంట్లో నజ్మా బేగం అనే మహిళ ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె పెళ్లి అయింది. ప్రస్తుతం తన భర్త తో పాటు చిన్న కుమార్తె మోహిన్బేగం తో కలిసి ఇంట్లో ఉంటుంది భర్త ఇంట్లో బీడీలు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. సోమవారం సాయంత్రం తల్లి తన కూతురైన పన్నెండేళ్ల కుమార్తె మోహిన్బేగంను అంట్లు కడగమని చెప్పింది. అందుకు ఆమె చేయనని చెప్పడంతో తల్లి కూతురు మోహిన్బేగంను కొట్టింది.
అందుకు సీరియస్ అయిన కూతురు తల్లి పై తిరగ మల్లింది.ఘర్షణలోనే ఇంట్లో ఉన్న కాళీ బీర్ బాటిల్ తో తల్లి తలపై కొట్టి ఇంట్లో ఉన్న కారం పొడి ని చల్లింది కూతురు మోహన్బేగం. ఈ దాడిలో తలపై తీవ్ర గాయాలు కావడంతో పాటు గొంతు కోసుకు పోయింది చుట్టుపక్కల వారు స్థానికులు 108 కు సమాచారం ఇవ్వగా స్థానిక ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి కి తల్లిని తరలించారు గొంతు ,తల భాగంలో గాయం ఎక్కువ కావడంతో కుట్లు వేసి వైద్యులు తర్వాత స్కానింగ్ చేయించారు తల్లి నజ్మా బేగం పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు..కానీ స్థానికులు మాత్రం వేరు.. ఇద్దరికీ మందు అలవాటు ఉందని, తల్లి ముందుకు డబ్బులు ఇవ్వక పోవడంతో కొట్టిందని అంటున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసును విచారిస్తున్నారు.