అప్పు తీర్చమంటే.. అత్యాచారం చేశాడు?

praveen
ఇటీవల కాలంలో మహిళలపై అత్యాచారాలు నిత్యకృత్యంగా మారిపోయాయి అని చెప్పాలి. సభ్య సమాజంలో బతుకుతున్న మానవత్వం ఉన్న మనుషులం అన్న విషయాన్ని మరిచిపోతున్నారు ఎంతోమంది. దారుణంగా వ్యవహరిస్తున్నారు. రోజు రోజుకి వెలుగులోకి వస్తున్న ఘటనలు సభ్యసమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తూ ఉన్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.  కామారెడ్డి జిల్లాలో ఆర్థిక లావాదేవీల విషయంలో వచ్చిన గొడవ కారణంగా ఓ మహిళపై యువకుడు దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా తీవ్రంగా దాడి చేసి నడిరోడ్డుపై పడేసి వెళ్ళిపోయాడు. ఇక విషయం తెలుసుకున్న బాధితురాలి బంధువులు ఆమెను ఆసుపత్రికి తరలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి జిల్లా బిబి పేట మండల కేంద్రంలో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక ఇదే ప్రాంతంలో ఉంటున్న ఓ మహిళ వద్ద జనగామ గ్రామానికి చెందిన గణేష్ అనే వ్యక్తి రెండు లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాడు. అయితే డబ్బు తీసుకుని చాలా కాలం కావడంతో అప్పు తీర్చాలంటూ మహిళా గణేష్ ని అడిగింది. ఈ క్రమంలోనే అప్పు తీరుస్తాను అన్న నెపంతో సదరు మహిళను గణేష్ తన బైక్ పై ఎక్కించుకుని గ్రామ శివారులో కి తీసుకెళ్ళాడు. ఆ తర్వాత  మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇక బాధితురాలు ప్రతిఘటించడంతో దారుణంగా దాడి చేసి మరి అత్యాచారం చేశాడు.

 అంతేకాదు ఆమె వద్ద ఉన్న బంగారు ఆభరణాలు నగదు కూడా లాక్కుని ఆమెను రోడ్డుపై పడేసి పరారయ్యాడు. అతి కష్టం మీద ఇంటికి చేరుకున్న బాధితురాలు జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో ఇక వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇక కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: