అది కావాలని అమాయకంగా అడిగాడు.. చివరికి?

praveen
నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే మహిళలు అడుగడుగునా భయంతో ఊగిపోవాల్సిన  పరిస్థితి ఏర్పడుతుంది ఏమో అని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా మహిళలే టార్గెట్ గా మారిపోయారు. మహిళలు ఒంటరిగా కనిపిస్తే అత్యాచారం చేయాలి అనుకునే వారు కొంతమంది అయితే.. మహిళలు ఒంటరిగా కనిపిస్తే దోపిడీ చేయాలని అనుకునేవారు మరికొంతమంది. ఇటీవల కాలంలో ఒంటరిగా కనిపిస్తున్న మహిళ మెడలో నుంచి బంగారు గొలుసులు లాక్కేళ్తున్న సంఘటనలు కూడా భయాందోళనకు గురి చేస్తున్నాయ్. దీంతో మహిళలు ఒంటరిగా బయటికి వెళ్ళాలి అంటే భయపడే పరిస్థితి నెలకొంది. అయితే చైన్ స్నాచర్లు ఆగడాలకు అటు పోలీసులు ఎప్పటికప్పుడు అడ్డుకట్ట వేసినప్పటికీ చైన్ స్నాచర్లు మాత్రం రోజురోజుకూ రెచ్చిపోతూనే ఉన్నారు.

 ఇకపోతే ఇటీవలే కామారెడ్డి జిల్లా బీర్పూర్ మండలం లోని చించోలి గ్రామంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు ఎత్తుకెళ్లి పోయారు. గ్రామానికి చెందిన చేవూరు సంధ్యారాణి కిరాణా దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తూ ఉంటుంది.  రోజు లాగానే ఇటీవలే దుకాణం తెరవడానికి వచ్చింది. ఇంతలో అక్కడికి ఒక అపరిచిత వ్యక్తి వచ్చాడు. సిగరెట్ కావాలని అడిగాడు. దుకాణం తెరిచిన తర్వాత ఇస్తాను అంటూ దుకాణం తెరుస్తూ ఉంది. ఇక ఇంతలో ఆమె వెనుకనుంచి బంగారం గొలుసు లాక్కుని పారిపోయాడు. ఆమె ప్రతిఘటించినప్పటికీ పక్కకు నెట్టివేసి అక్కడి నుంచి పరారయ్యాడు.

 అయితే ద్విచక్రవాహనంపై ఇక బాన్సువాడ పారిపోయినట్లు స్థానికులు గుర్తించి చెప్పారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక సమీపంలో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా దొంగ ఎటు వైపు వెళ్ళాడు అన్న విషయం తో పాటు అసలు దొంగతనం చేసింది ఎవరు అన్న విషయాలను కనుక్కునే పనిలో నిమగ్నమయ్యారు పోలీసులు. ఇక ఈ ఘటనతో స్థానిక మహిళలు అందరూ కూడా భయాందోళనలో మునిగిపోయారు. అయితే ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: