పేస్ బుక్ లో ప్రేమ.. మరో వ్యక్తితో పెళ్ళి.. యువతి మిస్సింగ్..

Satvika
అబ్బాయిలు, అమ్మాయిలను లొబరుచుకొనెందుకు ఎన్నో జిమ్మిక్కులు చేస్తారు.. అవన్నీ నిజం అని నమ్మి కొందరు యువతులు దారుణంగా మోస పోతున్నారు. ఇలాంటి ఘటనలు దేశం లో జరుగుతూనె ఉన్నాయి. ముఖ్యంగా సోషల్‌ మీడియా ద్వారా పరిచయం అయిన వ్యక్తుల మాటలకు అమ్మాయిలు ఈజిగా కనెక్ట్ అయిపోతున్నారు. తాజాగా మరో ఘటన వెలుగు చూసింది.. ఇంట్లో పెళ్ళి ఫిక్స్ చేయడంతో ఓ యువతి తనకూ ఇష్టం లేదని పేస్ బుక్ లో పరిచయం అయిన వ్యక్తిని కలిసెందుకు వెళ్ళింది. తర్వాత మిస్ అయ్యింది. అసలు ఆ యువతి ఎక్కడికి పోయింది అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము..


విషయాన్నికొస్తే.. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లో వెలుగు చూసింది.. రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో ఈ ఘటన జరిగింది.. ఇంట్లో పెళ్ళి సంబంధాలు చూస్తున్న నేపథ్యం లో తనకూ ఇష్టం లేని పెళ్ళి చేస్తున్నారని ప్రేమించిన వ్యక్తిని పెళ్ళి చేసుకోనెందుకు ఇంట్లో నుంచి పారిపొయింది. ఫేస్‌బుక్‌ లో పరిచయమైన చిత్తూరు జిల్లా వరదయ్యపాళెం మండలం కారిపాకం గ్రామానికి చెందిన వేములసాయిని ప్రేమించింది. అయితే తను ఇంట్లో నుంచి వచ్చేసిన విషయాన్ని తనకూ చెప్పింది. అంతేకాదు ఉద్యోగం కావాలని కోరింది. ఉద్యోగం వచ్చేవరకు హాస్టల్ లో వుండాలని హాస్టల్ లో దిగ బెట్టాడు.


ఇంట్లో కూతురు కనిపించలేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్ ను ట్రెస్ చేసిన పోలీసులు ఆమె ఓ హాస్టల్ లో వున్నట్లు గుర్థించారు. యువతి ఫోన్‌ ఆధారంగా లోకేషన్‌ గుర్తించి హాస్టల్‌కు వెళ్లారు.అక్కడ వార్డెన్‌ను విచారించారు.అసలు విషయాన్ని తెలుసుకున్నారు. పెదవేగి పోలీసులు అందించిన ఆధారాలతో యువతిని గుర్తించి నిర్ధారించుకుని మహిళా కానిస్టేబుల్‌ పర్యవేక్షణలో ఆమెను తీసుకొచ్చారు. ఆ యువతి తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడించారు.. తర్వాత తల్లి దండ్రులకు అమ్మాయిని అప్పగించారు. అమ్మాయిని కనిపెట్టడం లో పోలీసులు చేసిన ఆలోచనలు బాగున్నాయని డీఎస్పీ అభినందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: