రైతులకు కేంద్రం నుంచి అదిరిపోయే స్కీమ్?

Purushottham Vinay
మన ప్రభుత్వాలు రైతులకు అండగా వారికి అనేక విధాలుగా ప్రయోజనాలు చేకూరేలా చాలా స్కీమ్స్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఒక స్కీమ్ ద్వారా రైతులు ఏకంగా 15 లక్షల రూపాయల ఆదాయం పొందే ఛాన్స్  ఉంటుంది.ఇక ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ అనే పేరుతో కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ను అమలు చేస్తోంది. ఈ స్కీమ్ తో రైతులకు మంచి ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది.ఈ స్కీమ్ వల్ల ప్రయోజనం పొందిన వాళ్లు వ్యవసాయానికి సంబంధించిన ఏదైనా పరిశ్రమను స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. వ్యవసాయ వ్యాపార అవసరాల కోసం, ఎరువులు ఇంకా అలాగే వ్యవసాయ పనిముట్ల కోసం ఈ స్కీమ్ ఉపయోగపడుతుంది. అలాగే 11 మంది రైతులు ఒక పరిశ్రమని ఏర్పాటు చేయడం ద్వారా ఈ స్కీమ్ బెనిఫిట్ ను పొందే అవకాశాలు  ఉంటాయి.


పరిశ్రమని ఏర్పాటు చేసిన తర్వాత 15 లక్షల రూపాయల దాకా గ్రాంట్ ఆఫ్ మ్యాచింగ్ ఈక్విటీ లభిస్తుంది.ఈనాం వెబ్ సైట్ లో రైతులు రిజిస్టర్ చేసుకోవడం ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించిన ప్రయోజనాలను పూర్తిస్థాయిలో పొందే ఛాన్స్ ఉంటుంది. వచ్చే సంవత్సరం నాటికి 10,000 ఈ.ఎఫ్.వోలను ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తోంది. 15 లక్షల రూపాయల లోన్ ని మళ్లీ తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఈ లోన్ పొందిన వాళ్లు ఆర్గనైజేషన్ ను ఏర్పాటు చేసి పనులు మొదలుపెట్టాల్సి ఉంది.ఈ స్కీమ్ కు ఎంపికైన వాళ్లకు ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు సహాయ సహకారాలు అందించనుంది. అయితే 15 లక్షల రూపాయలు అంటే తక్కువ మొత్తం కాదు. ఈ స్కీమ్ ను రైతులు వాడుకొని ప్రయోజనం పొందితే వారికి చాలా మంచిది.అందుకే ఆసక్తి వున్నవాళ్లు మీ సమీపంలోని వ్యవసాయ అధికారులను సంప్రదించి ఈ స్కీమ్ గురించి పూర్తిస్థాయిలో వివరాలను తెలుసుకొండి.రైతులకి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: