LIC: వృద్ధులకు మేలు చేసే సూపర్ స్కీం?

Purushottham Vinay
ఇక కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం చాలా రకాల పథకాలను అమలు చేస్తోంది. వృద్ధులకు తోడుగా ఉండేందుకు పెన్షన్‌ సదుపాయాన్ని కూడా తీసుకువచ్చింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో కొన్ని మంచి పెన్షన్‌ పథకాలు కూడా ఉన్నాయి.ఇక ఇందులో ప్రధాన్‌ మంత్రి వయ వందన యోజన పథకం ఒకటి. ప్రధాన్ మంత్రి వయ వందన యోజన పెన్షన్ పథకంలో వివాహిత జంట 60 ఏళ్లు దాటితే గరిష్టంగా రూ. 15 లక్షల దాకా పెట్టుబడి పెట్టవచ్చు. ఇంతకుముందు ఈ పథకంలో ఒక వ్యక్తి పెట్టుబడి పెట్టగల గరిష్ట మొత్తం వచ్చేసి రూ. 7.5 లక్షలు. ఆ తరువాత ప్రభుత్వం పెంచింది. ఇక 60 ఏళ్లు పైబడిన వివాహిత జంటలు ఈ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. అరవై ఏళ్లు దాటిన వారికి జీవితంపై భరోసా కల్పించే ఉద్దేశంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ స్కీం ని అమలు చేస్తోంది. ఈ స్కీంకి సంబంధించిన గడువుతేదీ 2021 మార్చి 31 ఉండగా, దానిని 2023 మార్చి 31 దాకా పెంచింది కేంద్రం. ప్రముఖ బీమా కంపెనీ ఎల్ఐసీ ఈ స్కీంను ప్రభుత్వం తరపున అందిస్తోంది.ఇక ప్రతి నెలా రూ.18,500 పెన్షన్ పొందడానికి భార్యాభర్తలిద్దరూ కూడా ప్రధాన్ మంత్రి వయ వందన యోజనలో రూ.15 లక్షల డబ్బుని పెట్టుబడిగా పెట్టాలి.


ఈ జంట పెట్టుబడి పెట్టిన మొత్తం కూడా రూ. 30 లక్షలు అవుతుంది. ఈ స్కీంపై 7.40% వార్షిక వడ్డీ రేటుతో జంట సంవత్సరానికి రూ. 2,22,000 పొందుతారు. రూ.2,22,000ను 12తో భాగిస్తే వారికి నెలవారీ పింఛను రూ.18,500 వస్తుంది. ఒక్క వ్యక్తి మాత్రమే ఈ స్కీంలో రూ.15 లక్షలతో పెట్టుబడి పెడితే, వారికి నెలవారీ రాబడి రూ.9,250 వస్తుంది.ఇంకా ఈ పాలసీ 10 ఏళ్లు కాలవ్యవధితో ఉంటుంది.ఇందులో నెలవారీ ఆప్షన్‌ ఎంచుకుంటే కనీసం రూ.1,62,162, త్రైమాసిక ఆప్షన్‌ ఎంచుకుంటే రూ.1,61,074 ఇంకా అర్ధవార్షిక ఆప్షన్‌లో రూ.1,59,574, వార్షిక ఆప్షన్‌ లో రూ.1,56,658 కనీస మొత్తానికి పాలసీని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇక ఈ స్కీంలో కనిష్టంగా రూ. 1000 నుంచి గరిష్ఠంగా రూ.9,250 నెలవారీ పింఛను మీరు అందుకోవచ్చు. గతంలో ఈ స్కీంలో చేరే పెద్దలకు 8 శాతం వడ్డీ ఇస్తుండగా, నెలకు మాక్సిమం రూ.10,000 పింఛను అందేది. ఇప్పుడు దాన్ని మొత్తం 7.4 శాతానికి తగ్గించడంతో నెలవారీ మాక్సిమం పెన్షన్ రూ.9,250కి తగ్గుతోంది. పాలసీ కొనుగోలు చేసిన 3 సంవత్సరాల తర్వాత దీనిపై 75 శాతం దాకా రుణం పొందే సదుపాయం కూడా మీకు ఎల్‌ఐసీ అందిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

LIC

సంబంధిత వార్తలు: