ఈ స్కీంలో పెట్టుబడి పెడితే అదిరిపోయే రాబడి మీ సొంతం?

Purushottham Vinay
ఇక మీరు నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ కింద పెట్టుబడిని కనుక పెట్టాలనుకుంటే అందులో మీరు కేవలం రూ.1000తో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ స్కీంలో గరిష్ట పెట్టుబడిపై పరిమితి లేదు. ఇందులో మీరు ఎలాంటి రిస్క్ లేకుండా ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. అలాగే మీరు ఈ పథకాన్ని ఎంచుకుంటే ఇది మీ బ్యాంక్ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ కంటే చాలా వేగంగా మీ డబ్బును రెట్టింపు చేస్తుంది.మీరు ఎన్‌ఎస్‌సి స్కీం కింద పెట్టుబడి పెడితే ఆదాయపు పన్ను శాఖలోని సెక్షన్ 80సి కింద రూ.1.5 లక్షల తగ్గింపును మీరు పొందవచ్చు. అలాగే ఈ స్కీంలో ఏ వయోజనుడైనా తన బిడ్డ పేరు మీద లేదా ఈ పథకంలో తన పేరు మీద పెట్టుబడిని పెట్టవచ్చు. ఈ స్కీం కింద రూ.100, 500, 1000 ఇంకా 5000 సర్టిఫికెట్లు కొనుగోలు చేయవచ్చు.ఇందులో మెచ్యూరిటీ వ్యవధి వచ్చేసి 5 సంవత్సరాలు ఉంటుంది.ఇందులో మొత్తం మూడు రకాల సర్టిఫికెట్లను కొనుగోలు చేయవచ్చు.


సింగిల్, జాయింట్ A ఇంకా జాయింట్ B రకం పెట్టుబడిదారులు ఈ స్కీంలో డబ్బును పెట్టుబడి పెట్టవచ్చు. జాయింట్ A కింద ఇద్దరు వ్యక్తులు కలిసి డబ్బును పెట్టుబడి పెట్టవచ్చు.  జాయింట్ B రకంలో కూడా ఎవరైనా ఇద్దరు వ్యక్తులు కలిసి డబ్బు పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో మెచ్యూరిటీపై ఒకరికి మాత్రమే ప్రయోజనం లభిస్తుంది. అయితే ఈ నేషనల్‌ పెన్షన్‌ సర్టిఫికేట్‌ వివరాల ప్రకారం.. మీరు 5 సంవత్సరాల పాటు రూ.10 లక్షల డబ్బును పెట్టుబడి పెట్టినట్లయితే మెచ్యూరిటీ వ్యవధి తర్వాత మీకు మొత్తం రూ.14 లక్షల డబ్బులు లభిస్తాయి.అదే రూ.5 లక్షలు కనుక మీరు ఇన్వెస్ట్‌ చేసినట్లయితే మెచ్యూరిటీ తర్వాత దాదాపు 7 లక్షల దాకా పొందవచ్చు.నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీం కింద మీకు పన్ను మినహాయింపు ప్రయోజనం కూడా ఉంది. మీరు సమీపంలోని ఏదైనా పోస్టాఫీసుకు వెళ్లడం ద్వారా ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. మీరు  ఈ పథకంలో డబ్బు పెట్టుబడి పెట్టాలనుకుంటే ఈ పథకం మీకు చాలా మెరుగ్గా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: