టెర్రస్ పై ఇలా చేస్తే.. ఎక్కువ లాభం పొందవచ్చునట..!
వివరాల్లోకి వెళితే.. పంజాబ్ లోని ఇద్దరు వ్యక్తులు లాక్డౌన్ సమయాన్ని చక్కగా క్యాష్ చేసుకున్నారు. తమ ఇంటి డాబా పైనే కూరగాయలు, పండ్లు, పూల సాగు చేస్తున్నారు. వీటితో లాభాలు పొందుతూనే, మరో వైపు వెన్న తయారు చేసి రైతుల కు అమ్మి అలా కూడా సంపాదిస్తున్నారు. విదేశీ కూరగాయలు, పండ్లు ఇక్కడి వాతావరణం లో పండటం కష్టమైంది. మరి వాటిని ఎలా పండించాలి... అని లోతుగా అధ్యయనం చేసి, ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూ ముందుకు సాగారు. ఇప్పుడు స్థానిక రైతులు వీళ్ల దగ్గర ఆ పండ్లు, కూరగాయలు కొనుక్కుంటున్నారు. ఇలా వీళ్ళు చేయడం, సక్సెస్ అవ్వడంతో చాలా మంది వీరిని ఫాలో అవుతున్నారంటే ఇక వీరి రేంజ్ ఇప్పుడెంటో అర్థం చేసుకోవచ్చు.. ఇది వీళ్ళు సాధించిన ఘనత నే చెప్పాలి.. ఇలాంటి ఆలోచనలు రావడం పై చాలా మంది అభినందిస్తున్నారు..