ప్రముఖ వాణిజ్య బ్యాంకులలో ఒకటి ఎస్బీఐ ప్రజల కోసం ఎన్నో సువర్ణ అవకాశాలను కల్పిస్తున్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ఈ బ్యాంక్ ఎంతో చేసింది.ఈ బ్యాంక్ సేవలకు మెచ్చి భారీగా కష్టమర్లు పెరుగుతున్నారు.ఇప్పటికే దాదాపు 40 కోట్లకు పైగా వినియోగదారులు ఉన్నారు. అంతేకాకుండా దేశంలో ఎక్కువ సంఖ్యలో బ్రాంచ్ లు ఉన్న ఎస్బీఐ భారీ సంఖ్యలో ఏటీఎం సెంటర్లను కలిగి ఉండటంతో పాటు ఏటీఎం సర్వీసులను అందిస్తోంది. అయితే ఏటీఎంల ద్వారా లావాదేవీలను జరిపే వాళ్లు ఏటీఎం ఛార్జీల గురించి కచ్చితంగా అవగాహనను ఏర్పరచుకోవాలి.
ఎస్బీఐ ఏటీఎం నిబంధనల గురించి తెలుసుకోకపోతే ఛార్జీల రూపంలో బ్యాంక్ అకౌంట్ లోని నగదు కట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎస్బీఐ ఖాతాదారులు తమ డెబిట్ కార్డ్ ద్వారా నెలకు ఎనిమిది సార్లు ఎటువంటి ఛార్జీలను చెల్లించాల్సిన అవసరం లేకుండా డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు. ఇకపోతే అందరికీ తెలిసిన విషయమే ఈ బ్యాంక్ ఏటీఎమ్ ను వేరే ఇతర బ్యాంక్ ల ఏటీఎంల నుంచి మూడుసార్లు నగదు విత్ డ్రా చేస్తే మాత్రమే ఛార్జీలను చెల్లించాల్సిన అవసరం ఉండదు.
బ్యాంక్ అకౌంట్ లో తగినంత బ్యాలెన్స్ లేకుండా ఎస్బీఐ ఏటీఎం నుంచి విత్ డ్రా చేసేందుకు ప్రయత్నించినా ఛార్జీలను తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది. మెట్రో నగరాల్లో ఎనిమిది సార్లు ఉచితంగా డబ్బులు విత్ డ్రా చేసే ఛాన్స్ ఉంటే నాన్ మెట్రో నగరాల్లో మాత్రం పదిసార్లు డబ్బులను డ్రా చేసుకోవచ్చు. మనము తీసుకోవాలి అనుకున్నంత డబ్బులు ఏటీఎమ్ లో ఉన్నాయో లేదో అనే అనుమానం కాకుండా బ్యాలెన్స్ చెక్ చేసుకుని నగదు విత్ డ్రా చేస్తే మంచిది. బ్యాలెన్స్ లేకుండా నగదు విత్ డ్రా చేయడానికి ప్రయత్నిస్తే 20 రూపాయల పెనాల్టీతో పాటు జీఎస్టీని అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇవన్నీ తెలుసుకొని ఉంటే మరీ మంచిది. మన అకౌంట్ లోంచి డబ్బులు కట్ అవ్వవు..