బిగ్ బ్రేకింగ్: నాలుగు రోజులు బ్యాంకుల మూత.... ఎలెర్ట్ కాకపోతే అంతే..!
బ్యాంకుల ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం యూనియన్ల సంఘాలతో సమ్మె బాట పడుతున్నారు. దీంతో వరుసగా సెలవులు రానున్నాయి. దీంతో కస్టమర్లు అలెర్ట్గా ఉండాలని బ్యాంకులు సూచిస్తున్నాయి. బ్యాంకు లావాదేవీలు ఉంటే అవి ఈ లోగానే పూర్తి చేసుకోవాలని చెపుతున్నాయి.
ఈ నెల 25న ఉగాది పండుగ సందర్బంగా సెలవు, మరుసటి రోజు గురువారం బ్యాంకులు పనిచేసినా... బ్యాంకు ఉద్యోగుల సమ్మెతో లావాదేవీలు జరగవు.
ఇక 27న బ్యాంకు యూనియన్ల సమ్మె ప్రకటించాయి, 28వ తారీకు నాలుగవ శనివారం, 29న ఆదివారం సాధారణ సెలవు. దీంతో బ్యాంకులు తిరిగి ఈ నెల 30న మాత్రమే తెరచుకుంటాయి. అంటే నాలుగు రోజుల గ్యాప్ తర్వాత తిరిగి సోమవారం మాత్రమే బ్యాంకులు యధావిధిగా పనిచేస్తాయి.