సింగరేణి సంస్థ కీలక ఒప్పందం.. ఇక వెలుగులే వెలుగులు?
రాజస్థాన్ విద్యుత్ అనుబంధ సంస్థతో కలిసి జాయింట్ వెంచర్ కంపెనీ ఏర్పాటు చేసుకుంటామని ప్రభుత్వం తెలంగాణ వెల్లడించింది. ఈ జాయింట్ వెంచర్ కంపెనీతో 1600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ , రాజస్థాన్ లో 1500 మెగావాట్ల సోలార్ విద్యుత్తు ఉత్పాదనకు ఒప్పందం కుదిరింది. సింగరేణి ఆర్థిక పరిపుష్టికి ఇది అతి పెద్ద అవకాశం అని సింగరేణి యాజమాన్యం తెలిపింది. మొత్తం వ్యయం, లాభాల్లో 74శాతం సింగరేణికి, 26శాతం రాజస్థాన్ విద్యుత్ ఉత్పాదన్ నిగం లిమిటెడ్ కు వాటా ఉంటుంది. ఈ ఒప్పందంతో తొలిసారిగా ఇతర రాష్ట్రాల్లో అతి పెద్ద సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుతో జాతీయ స్థాయి కంపెనీగా సింగరేణికి గుర్తింపు రాబోతుందని సింగరేణి యాజమాన్యం వెల్లడించింది.