
శభాష్ రేవంత్ రెడ్డి.. చక్కటి నిర్ణయం తీసుకున్నారు?
వంట చేసుకుని తినే పరిస్థితి లేకపోవడంతో ఆమెకు భోజనం సదుపాయం కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం గుండ్లసింగారం గ్రామానికి చెందిన సలీమా దీన స్థితిపైన పత్రికలో వచ్చిన కథనంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు సూర్యాపేట జిల్లా కలెక్టర్ తో మాట్లాడారు. కాలిన గాయాల కారణంగా సలీమా నరాలు దెబ్బతినడంతో ఆమె మంచానికే పరిమితమయ్యారు. దీంతో సలీమా పదేళ్ల కుమార్తె రిజ్వాన నిత్యం తల్లికి సపర్యలు చేస్తోంది. ఒక వైపు తల్లి బాధ్యతలు చూసుకుంటూనే బడికి వెళ్లి చదువుకోవడం విశేషం