రేవంత్ రెడ్డి ఇస్తున్న లాస్ట్ ఛాన్స్ ఇదే ... ఇలా పాల్గొనండి?

frame రేవంత్ రెడ్డి ఇస్తున్న లాస్ట్ ఛాన్స్ ఇదే ... ఇలా పాల్గొనండి?

Chakravarthi Kalyan
కుల గణన సర్వే ఇటీవల పూర్తయిన సంగతి తెలిసిందే. అయితే అందులో 3.1 శాతం మంది పాల్గొనలేదు. ఇప్పుడు అలాంటి వారికి ప్రభుత్వం మరో అవకాశం ఇస్తోందని తెలంగాణ ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా చెబుతున్నారు. అలాంటి వారు ఇవాళ్టి నుంచి ఈనెల 28 వరకు కులగణనలో పాల్గొనని వారి వివరాల నమోదు చేసుకోవచ్చు.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కులగణన సర్వేలో పాల్గొనని 3,56,323 కుటుంబాలు ఉన్నట్టు గుర్తించారు. కులగణన వివరాల నమోదు కోసం టోల్ ఫ్రీ నంబరు 040-21111111 ఏర్పాటు చేశారు. ఫోన్ చేసిన వారి ఇంటికెళ్లి ఎన్యుమరేటర్లు వివరాలు నమోదు చేయనున్నారు. ఎంపీడీవో, వార్డు కార్యాలయాలకు వెళ్లి నేరుగా వివరాలు నమోదు చేయించుకొనే ఏర్పాట్లు కూడా చేశారు. అలాగే https://seeepcsurvey.cgg.gov.inలో సర్వే ఫారం డౌన్‌లోడ్ చేసుకుని ప్రజాపాలన సేవకేంద్రంలో ఇవొచ్చని కూడా తెలిపారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్, కలెక్టర్లు ప్రత్యేక చొరవ తీసుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు:

Unable to Load More