మాజీ మంత్రి విడదల రజిని.. అన్ని కోట్లు నొక్కేశారా?
రజినిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రత్తిపాటి పుల్లారావుకు పసుమర్రు రైతులు వినతి పత్రం ఇచ్చారు. వైసీపీ హయాంలో చేపట్టిన జగనన్న కాలనీలు అతి పెద్ద కుంభకోణమని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. భూమి కొనుగోలు, మౌలిక వసతుల పేరుతో రూ.వేల కోట్ల అవినీతి జరిగిందన్న మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు.. భూమి కొనుగోలులో రూ.వందల కోట్లు చేతులు మారాయన్నారు. చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పసుమర్రు రైతులకు న్యాయం చేస్తానన్న మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హామీ ఇచ్చారు.