గ్రూప్‌1 మెయిన్స్ కు 1:100.. రేవంత్‌రెడ్డికి హరీశ్‌రావు డిమాండ్‌?

Chakravarthi Kalyan
కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండగా నిరుద్యోగులను అనేక విధాలుగా రెచ్చగొట్టిన నాయకులు, అధికారంలోకి రాగానే వారి పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారో అర్థమవుతోందని మాజీ మంత్రి హరీష్ రావు అంటున్నారు. గ్రూప్ 1 మెయిన్స్ కు 1:100 నిష్పత్తిలో పిలవాలని... గ్రూప్ 2, 3 పోస్టులు పెంచాలని అభ్యర్థులు.. నాయకుల కాళ్లు పట్టుకొని వేడుకునే పరిస్థితి రావడం దురదృష్టకరమన్న మాజీ మంత్రి హరీష్ రావు.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గ్రూప్ 1 మెయిన్స్ కు 1:100 నిష్పత్తిలో పరిగణించాలని విజ్ఞప్తి చేసిన వారికి, అధికారంలోకి రాగానే ఆ విజ్ఞప్తులు ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు.

25వేల టీచర్ పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఎన్నికల హామీగా చెప్పిన కాంగ్రెస్ పార్టీ, 11 వేల పోస్టులు మాత్రమే వేసి చేతులు దులుపుకొందన్న మాజీ మంత్రి హరీష్ రావు.. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి, ఆరు నెలలు గడుస్తున్నా ఆ ప్రక్రియకు సంబంధించి ఎలాంటి ప్రణాళిక రూపించకపోవడం విద్యార్థులను మోసం చేయడమేనన్నారు. భారాస ప్రభుత్వ హయాంలో భర్తీ చేసిన పోస్టులకు నియామక పత్రాలు అందించి, 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని డబ్బా కొట్టుకోవడం తప్ప... యువత, నిరుద్యోగుల కోసం కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమిటని ప్రశ్నించిన మాజీ మంత్రి హరీష్ రావు.. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి గ్రూప్స్ విద్యార్థుల వినతులను పరిగణలోకి తీసుకోవాలన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: