కేసీఆర్‌ చెప్పిన ఆ షాకింగ్‌ న్యూస్‌ అబద్దమేనా?

Chakravarthi Kalyan
మాజీ ముఖ్యమంత్రి మహబూబ్ నగర్ పర్యటనలో ఎలాంటి విద్యుత్ అంతరాయం కలగలేదని విద్యుత్‌ అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు మహబూబ్ నగర్ ఆపరేషన్స్ సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ ఎస్.ఈ ఒక ప్రకటన విడుదల చేశారు. మాజీ మంత్రి, మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే ఇంటి చుట్టుపక్కల విద్యుత్ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. ఎలాంటి అంతరాయం లేదని స్థానికులు స్పష్టం చేశారన్నారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎశ్‌ అధినేత కేసీఆర్ తన సోషల్ మీడియా ఖాతాలో మహబూబ్ నగర్‌లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో తాను భోజనం చేస్తుండగా రెండుసార్లు కరెంట్ పోయిందని పేర్కొన్నారు.
 
అయితే.. అటువంటిది ఏం జరగలేదని మహబూబ్ నగర్ ఆపరేషన్స్ సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ ఎస్.ఈ స్పష్టం చేశారు. విద్యుత్ అంతరాయం ఏర్పడితే సబ్ స్టేషన్ ట్రాన్స్ ఫార్మర్స్ రికార్డులలో నమోదు చేస్తారన్నారు. అసలు మాజీ ముఖ్యమంత్రి మహబూబ్ నగర్ పర్యటనలో అసలు విద్యుత్ అంతరాయమే ఏర్పడలేదని విద్యుత్ శాఖ వెల్లడించింది. అంటే కేసీఆర్‌ చెప్పింది అబద్దమేనా?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: