థ్రిల్లింగ్ విక్టరీ.. అదిరే కలెక్షన్స్ రాబడుతున్న తెప్పసముద్రం?

Chakravarthi Kalyan
"బిగ్ బాస్" ఫేం అర్జున్ అంబటి హీరోగా, కిశోరి దాత్రక్ హీరోయిన్‌గా ఇటీవల వచ్చిన చిత్రం తెప్ప సముద్రం. రవిశంకర్, చైతన్య రావు ప్రధాన పాత్రల్లో నటించారు. సతీష్ రాపోలు దర్శకత్వంలో బేబీ వైష్ణవి సమర్పణలో శ్రీమణి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఈ సినిమా వచ్చింది.  నీరుకంటి మంజులా రాఘవేందర్ గౌడ్ ఈ తెప్ప సముద్రం చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందు వచ్చిన ఈ తెప్ప సముద్రం తెలుగు రాష్ట్రాల్లో అన్ని కేంద్రాల్లో దిగ్విజయంగా ప్రదర్శించ బడుతోంది.

వాస్తవ సంఘటనలతో.. అనేక మలుపులతో థ్రిల్ కలిగించిన ఈ చిత్రాన్ని క్రిటిక్స్ కూడా మెచ్చుకుంటున్నారు. మూడు రోజుల్లో రూ.2.25 కోట్లను వసూలు చేసి... బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ రాబట్టిందని నిర్మాత నీరుకంటి మంజులా రాఘవేందర్ గౌడ్ అంటున్నారు. ఈ చిత్రాన్ని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు చెబుతున్న నిర్మాత.. ఇందులో లీడ్ రోల్ పోషించిన అర్జున్ అంబటి, హిరోయిన్ కిషోర్ దాత్రిక్, చైతన్య రావుల నటనను ఆడియెన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారన్నారు. లాయర్ విశ్వనాథ్ పాత్రలో రవిశంకర్ పోషించిన పాత్ర సినిమాకే హైలైట్ గా నిలిచిందని నిర్మాత తెలిపారు. వాస్తవ ఘటనలను బేస్ చేసుకుని సస్పెన్స్ థ్రిల్లర్ గా మలిచిన ఈ చిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తున్నారని నిర్మాత ఆనందం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: