ఏపీ: పొత్తుల లెక్క తేల్చేసిన షర్మిళ.. ఇదిగో లిస్టు?

Chakravarthi Kalyan
అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల సమయం దగ్గరకు వస్తుండటంతో ఏపీలో పార్టీలు పొత్తుల లెక్కలు తేల్చేసుకుంటున్నాయి. ఇప్పటికే  బీజేపీ, జనసేనతో టీడీపీ లెక్కలు తేల్చేసుకుంది. అలాగే ఏపీలో కాంగ్రెస్‌ పార్టీ కూడా పొత్తుల విషయంలో క్లారిటీకి వస్త్తోంది.  సీపీఐతో పొత్తు ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిళ తాజాగా ఆ పార్టీకి ఇచ్చే సీట్లపై ఓ ప్రకటన చేశారు. పోత్తుల్లో భాగంగా  సీపీఐకి కాంగ్రెస్‌ పార్టీ ఒక ఎంపి సీటు, 8  అసెంబ్లీ సీట్లు కేటాయించింది. గుంటూరు పార్లమెంటు నియోజక వర్గం లో సీపీఐ పోటీ చేస్తుందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి స్పష్టం చేశారు.

ఇదే సమయంలో అసెంబ్లీ సీట్లపైనా క్లారిటీ వచ్చేసింది. విజయవాడ పశ్చిమం, విశాఖ పశ్చిమం, అనంతపురం, పత్తికొండ, అనంతపురం, తిరుపతి, రాజంపేట, ఏలూరు, కమలాపురం అసెంబ్లీ సెగ్మెంటులను సీపీఐకి కేటాయించినట్లు కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: