ఆ 4 ఎంపీ సీట్లకు కాంగ్రెస్ అభ్యర్థులు వీరే?
ఈ నాలుగు సీట్ల ప్రకటనతో తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం, వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలు మినహా మిగతా వాటికి అభ్యర్థుల ఖరారు పూర్తయింది. అభ్యర్థుల ఎంపికపై నిన్న కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ దిల్లీలో చర్చించింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. తెలంగాణతోపాటు ఉత్తర్ప్రదేశ్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, గోవా అభ్యర్థుల గురించి కూడా చర్చించారు. ఈ చర్చల్లో సోనియాగాంధీ, కేసీ వేణుగోపాల్, పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి దీపా దాస్మున్షీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి పాల్గొన్నారు. గోవా మినహా మిగిలిన 4 రాష్ట్రాల్లోని 14 స్థానాలకు అభ్యర్థుల పేర్లను పార్టీ విడుదల చేసింది.