యువత తీరుపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంచలన వ్యాఖ్యలు?
సత్వర న్యాయం కావాలని యువభారతం ఆశిస్తోందని.. దాన్ని అందుకునేంతగా కోర్టులు మారాలని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ ఆకాంక్షించారు.
కింది కోర్టుల్లోనే కాదు.. హైకోర్టుల్లోనూ మౌలిక సౌకర్యాల కొరత ఉందన్న సీజేఐ జస్టిస్ చంద్రచూడ్.. ఇటీవల ఈ కోర్టు పథకంలో భాగంగా పలుచోట్ల ఈ సేవ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. సాంకేతిక యుగంలో కోర్టు కార్యకలాపాలకు ఇంటర్నెట్ వాడుకోవాలన్న సీజేఐ జస్టిస్ చంద్రచూడ్.. ప్రజలకు న్యాయ సేవలు మరింత చేరువయ్యేలా మార్పులు రావాలన్నారు.