జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన వంగవీటి?

Chakravarthi Kalyan
విజయవాడకు చెందిన బీజేపీ నేత వంగవీటి నరేంద్ర వైసీపీలో చేరారు. కండువా కప్పి వైకాపా లో చేర్చుకున్న సీఎం వైఎస్ జగన్.. పార్టీలోకి ఆహ్వానించారు. రాజశేఖరరెడ్డి కుటుంబానికి వంగవీటి కుటుంబానికి నాలుగు దశాబ్దాల అనుబంధం  ఉందన్న వంగవీటి నరేంద్ర.. నాసోదరుడు వంగవీటి రాధా కిందటి సారి  వైకాపాను వీడి తప్పు చేశారన్నారు. రాష్ట్రంలో తెదేపా బీజేపీ కూటమి  ఏర్పడింది  ప్రజలకోసం కాదు.... వారి స్వార్థం కోసమేనని.. టీడీపీకి వంగవీటి కుటుంబం బద్ద శత్రువని.. టీడీపీ ప్రభుత్వంలోనే వంగవీటి రంగా హత్యకు గురయ్యారని వంగవీటి నరేంద్ర వివరించారు.
టీడీపీ ప్రభుత్వం అధికారం ను అడ్డుపెట్టి వంగవీటి రంగ హత్య  చేసిన వారిని తప్పించిందన్న వంగవీటి నరేంద్ర... రంగాను హత్య చేసిన వారిని టీడీపీ ప్రభుత్వమే శిక్షపడకుండా తప్పించిందన్నారు. రంగాను హత్య చేసిన వారికి శిక్ష పడేందుకు మేము పోరాడుతూనే ఉన్నామని.. టీడీపీతో పొత్తు పెట్టుకుని బీజేపీ తప్పుడు నిర్ణయం తీసుకుందని వంగవీటి నరేంద్ర అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: