కొత్త రికార్డులు సృష్టిస్తున్న సింగరేణి?
గత ఏడాది సాధించిన 33 వేల కోట్ల టర్నోవర్ ను, గత నెల ఫిబ్రవరి మాసాంతానికే సాధించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 700 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, అదే పరిమాణంలో బొగ్గు రవాణా జరపాలని నిర్ణయించింది. ఈ దిశగా అన్ని ఏరియాలు రోజువారీ లక్ష్యాల సాధనకు కృషి చేస్తున్నాయి. వార్షిక లక్ష్య సాధన దిశగా ముందుకు పోతున్నాయి. ఇకపై రోజుకు 2 లక్షల 45 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా చేయడం ద్వారా వార్షిక లక్ష్యాన్ని చేరుకుంటుంది.