కేసీఆర్ కాచుకో.. ధరణి లెక్కలు బయటకు?
రెండు రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణానికి శంకుస్థాపన చేశారన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి.. ప్రతి గ్రామంలో కమిటీ వేసి ప్రతి పేదవాడికి ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. గత పదేళ్లలో కనీసం లక్ష ఇళ్లు మంజూరు చేయలేదని.. 2,160 ఇండ్లకు 74.80 కోట్ల రూపాయలు మంజూరు చేసామని.. మొదటి నాలుగు రోజుల్లో నిధులు విడుదల చేసానని.. రాబోయే 6 నెలలో ఇండ్లు పూర్తి చేసి ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు.