కేసీఆర్‌ కాచుకో.. ధరణి లెక్కలు బయటకు?

Chakravarthi Kalyan
ధరణి పేరుతో దోచుకున్న సొమ్మును మరి కొద్ది రోజుల్లో బయట పెడతామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అంటున్నారు. గడిచిన పదేళ్లలో ప్రజల ఆస్తులును భారాస నేతలు దోచుకున్నారన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి... మేము పరిపాలకులం కాదు.. మేము సేవకులమన్నారు. ప్రజల సమస్యలు వినే ప్రజా ప్రభుత్వం తమదని.. మన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వమని.. 70 రోజుల్లోనే ఉచిత కరెంట్, మహిళలు కు 500 గ్యాస్ అమలు చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు.
రెండు రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణానికి శంకుస్థాపన చేశారన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి.. ప్రతి గ్రామంలో కమిటీ వేసి ప్రతి పేదవాడికి ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. గత పదేళ్లలో కనీసం లక్ష ఇళ్లు మంజూరు చేయలేదని.. 2,160 ఇండ్లకు 74.80 కోట్ల రూపాయలు మంజూరు చేసామని.. మొదటి నాలుగు రోజుల్లో నిధులు విడుదల చేసానని.. రాబోయే 6 నెలలో ఇండ్లు పూర్తి చేసి ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr

సంబంధిత వార్తలు: