శభాష్‌: తెలుగు రైతుబడి యూట్యూబర్‌కు ఐఐఐటీ ఢిల్లీ ఆహ్వానం!

Chakravarthi Kalyan
డిజిటల్ మీడియా వేదికల ద్వారా తెలుగు రైతులకు సమగ్ర వ్యవసాయ సమాచారం పంచుతున్న తెలుగు రైతుబడికి అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థ ఐఐఐటీ ఢిల్లీ.. తాము నిర్వహిస్తున్న ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమ్మిట్-2024 (ఈ సమ్మిట్) లో పాల్గొని ప్రసంగించాల్సిందింగా రైతుబడి సంస్థ స్థాపకుడు రాజేందర్ రెడ్డిని ఆహ్వానించింది. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలలో యువతకు ఉన్న సరికొత్త అవకాశాలను చర్చించేందుకు రావాలని కోరింది. ఈ నెల 15, 16 తేదీలలో ఈ సదస్సు ఢిల్లీలోని ఇంద్రప్రస్థ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఢిల్లీ (IIITD)లో జరగనుంది. 

దేశ, విదేశాల అనేక మంది ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. రైతుబడి యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్, ఎక్స్  వేదికలుగా దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటిస్తూ.. రైతుల అనుభవాలను తోటి రైతులకు చేరవేస్తోంది. ఇటీవలే జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన జాతీయ ఉత్తమ క్రియేటర్ల అవార్డుల్లోనూ.. వ్యవసాయ చానెళ్ల కేటగిరీలో రైతుబడి అత్యధిక ఓట్లతో ప్రథమ స్థానంలో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: