అంబానీ ఇంట పెళ్లి అంటే మాటలా.. ఇటీవల అనంత్-రాధికల ప్రి వెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా అంబానీ కూతురు ఇషా అంబానీ ధరించిన బంగారు బ్లౌజ్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. నెట్టింట వైరల్ అవుతోంది. అబుజానీ-సందీప్ ఖోస్లా రూపొందించిన గోల్డెన్ జరీతో ఎంబ్రాయిడరీ చేసిన ఎరుపు రంగు భారీ లెహెంగా అందరినీ ఆకట్టుకుంది. దీనికి జతగా ఎరుపు రంగు బ్లౌజ్ వేసుకుంది. దానిపై బంగారు జరీ, వజ్ర వైఢూర్యాలతో డిజైన్ చేయించారు. ఈ బ్లౌజ్ తయారీలో వాడిన నవరత్నాలను గుజరాత్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల నుంచి తెప్పించారు.
ఈషా తన వద్ద ఉన్న విలువైన వజ్రాభరణాలను కూడా ఈ బ్లౌజ్ కోసం వాడిందట. పోల్కీ, రూబీ, వజ్రాలు, పచ్చలు, కెంపులు వాడారట. ఎరుపు రంగు బ్లౌజ్పై ఈ ఆభరణాలన్నీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేశారు. దీనికి గోల్డ్, సిల్వర్ జర్దోసీ వర్క్లో ఈ విలువైన ఆభరణాల్ని పొదిగారు. అందుకే ఈ బ్లౌజ్ ఈషాకు కొత్త లుక్ని తెచ్చింది.