కాళేశ్వరం ఏటీఎం అయితే చర్యలేవీ మోదీ?
మాజీ సీఎం కేసీఆర్కు ఇంకా అధికార మత్తు వదలలేదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయడానికి బీఆర్ఎస్కు అభ్యర్థులు కూడా దొరకడం లేదని ద్వజమెత్తారు. రాష్ట్రానికి ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం పలికి సుపంప్రదాయానికి తెరలేపారన్న మల్రెడ్డి తెలంగాణ ప్రజల కోసమే ప్రధానిని సీఎం కలిశారని.. గత ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ ఏనాడు ప్రధాని మోదీ రాష్ట్రానికి వస్తే పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు. భూఆక్రమణలు, ప్రాజెక్టుల్లో అక్రమాలు,అవినీతిపైన చేసిన ఫిర్యాదులను కేంద్రం చెత్త బుట్టలో వేసిందని రంగారెడ్డి ఆరోపించారు.