
రాహుల్ 73 శాతం ఫార్ములా.. వర్కవుట్ అవుతుందా?
ప్రైవేటు ఆసుపత్రులు, విద్యాసంస్థల యజమానుల జాబితా తీసినా..ఈ 73శాతంలో ఒక్కరూ ఉండరంటున్న రాహుల్ గాంధీ. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ నుంచి రూ.100 ఖర్చుచేస్తే ఈ 73శాతానికి రూ.6 మాత్రమే దక్కుతోందంటున్నారు. ఈ 73శాతానికి అగ్రవర్ణ పేదలను కలిపితే...వారికి ఈ దేశంలో ఎలాంటి అవకాశాలు లేవన్న రాహుల్ గాంధీ.. గతంలో ప్రభుత్వరంగ సంస్థలు ఉండేవని.. అందులో పేదలకు ఉద్యోగాలు వచ్చేవని.. కానీ నరేంద్ర మోదీ ఈ సంస్థలన్నింటినీ మూసివేశారని అంటున్నారు.