అరె ఏంట్రా ఇది: నిన్న పార్టీలో చేరిక.. ఇవాళ టికెట్?
మొన్న భాజపాలో చేరిన నాగర్ కర్నూల్ భారాస సిట్టింగ్ ఎంపీ రాములుకు బదులు వారి కుమారుడు భరత్ కు టికెట్ దక్కింది. రాములు విజ్ఞప్తి మేరకే అధిష్టానం భరత్ కు టికెట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక నిన్న భాజపా గూటికి చేరిన భారాస జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ కు కూడా టికెట్ దక్కింది. తెలంగాణలో మొత్తం 17లోక్ సభ స్థానాలు ఉండగా తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన అధిష్టానం మరో ఎనిమిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.