బిగ్ డే.. టీడీపీలోకి ఇద్దరు వైసీపీ ఎంపీలు, ఒక ఎమ్మెల్యే?
వైసీపీ ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, లావు శ్రీకృష్ణ దేవరాయలు టీడీపీలో చేరబోతున్నారు. వేమిరెడ్డి నెల్లూరులో జరిగే కార్యక్రమంలోనూ.. శ్రీకృష్ణదేవరాయలు గుంటూరు జిల్లాలో జరిగే కార్యక్రమంలోనూ టీడీపీలో చేరబోతున్నారు. ఇక వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కూడా ఇవాళే టీడీపీలో చేరబోతున్నారు. ఇలా నేతలంతా టీడీపీలో చేరడం తమ పార్టీ అధికారంలోకి రాబోతోందనడానికి చిహ్నం అంటున్నారు టీడీపీ నేతలు. మరి ఇది ఎంత వరకూ నిజమవుతుందో.