అందుకే బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి వస్తున్నారా?

Chakravarthi Kalyan
బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా జిహెచ్ఎంసి డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు కాంగ్రెస్‌లో చేరారు. పార్టీలో చేరిన జిహెచ్ఎంసి డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి దంపతులకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. టిఆర్ఎస్ పార్టీ కోసం 24 సంవత్సరాలు కష్టపడ్డ వారిని కాకుండా పార్టీకి సంబంధం వ్యక్తులను పదవులు కట్టబెట్టడం సరికాదని వారు మంచి నిర్ణయం తీసుకున్నారని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో వచ్చిన బిఆర్ఎస్ పార్టీ అమరుల త్యాగాలపై ప్రభుత్వము ఏర్పాటు చేసుకొని తెలంగాణ ఉద్యమకారులను విస్మరించిందన్న రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలందరిని సంక్షేమ అభివృద్ధి వైపు నడిపించేందుకు కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల ఆధారంగా ఏర్పడిందని.. బిఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న అవమానాన్ని భరించలేక కాంగ్రెస్ పార్టీలోకి నాయకులు వస్తున్నారని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ప్రతి నాయకుడికి సముచిత స్థానం ఉంటుందని మంత్రి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

brs

సంబంధిత వార్తలు: