ఆంధ్రా తాగునీటి వినియోగంపై రేవంత్రెడ్డి నిఘా?
నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి తాగు నీరు తీసుకోవాలంటే కేఆర్ఎంబీకి లేఖ రాయాల్సి ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కాబట్టి ఏపీకి ఎంత నీరు అవసరమో సమగ్రంగా సమీక్షించి వెంటనే కేఆర్ఎంబీకి లేఖ రాయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఏప్రిల్, మే నెలల్లో వర్షాలతో జూరాలకు నీరు రావడంతో ఇబ్బంది తలెత్తలేదని.. లేకపోతే నారాయణపూర్ జలాశయం నుంచి నీటి విడుదల కోసం కర్ణాటకను కోరాల్సి ఉంటుందని అధికారులు సీఎంకు తెలిపారు.