బాబు ముసలోడైపోయాడంటున్న లక్ష్మీపార్వతి?

Chakravarthi Kalyan
చంద్రబాబు పనైపోయిందని వైసీపీ నేత లక్ష్మీపార్వతి అంటున్నారు. అల్లుడి బాగోతం అత్తగా నాకే తెలుసు అని చంద్రబాబుపై ల‌క్ష్మీపార్వతి కామెంట్లు చేశారు. చంద్రబాబు పాలనలో రూ. 6 లక్షల కోట్లు లూటీ జరిగిందని ఆమె విమర్శించారు. చంద్రబాబు పనైపోయిందని.. ఆయన ముసలోడైపోయాడని.. ఆయనకు మూడు కాళ్లొచ్చేశాయని ల‌క్ష్మీపార్వతి అన్నారు. అందుకే చంద్రబాబు తన కొడుకుని సీఎం చేయాలని ప్రయత్నిస్తున్నాడని కామెంట్ చేశారు.
చంద్రబాబు బాధితుల్లో నేను, నాభర్త ఎన్టీఆర్ ముందు వరుసలో ఉంటామంటున్న ల‌క్ష్మీపార్వతి..  చంద్రబాబుకి ఆడవాళ్లంటే అసహ్యమని తెలిపారు. జగన్‌ను తిట్టడానికే చంద్రబాబు మీటింగులు పెడుతున్నాడని... అయితే సన్నాసి అయిన లోకేష్‌ కావాలో మంచి వ్యక్తి అయిన జగన్ కావాలో ప్రజలు ఆలోచించాలని ల‌క్ష్మీపార్వతి సూచించారు. పొరబాటున ప్రభుత్వం మారితే ఏపీ పూర్తిగా దోపిడీకి గురవుతుంది అని ప్రజలను ల‌క్ష్మీపార్వతి హెచ్చరించారు. చంద్రబాబు ఆడవాళ్లను అస్యహించుకుంటే.. మహిళకు సాధికారతతో సమాజం వృద్ధి చెందుతుందని సీఎం జగన్‌ బలంగా నమ్మారని లక్ష్మీపార్వతి అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: