లక్కీఛాన్స్.. ఇంకా ఓటు నమోదు చేసుకోవచ్చు?
అందుకే అర్హులైన వారు ఓటు కోసం ఫారం 18 సమర్పించాలని సీఈవో పేర్కొన్నారు. పద్దెనిమిది సంవత్సరాలు నిండి.. పట్టభద్రులై మూడేళ్లయిన వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. మూకుమ్మడిగా ఇచ్చే దరఖాస్తులను స్వీకరించబోమని వికాస్ రాజ్ స్పష్టం చేశారు. అయితే కుటుంబ సభ్యులందరివి కలిపి ఒకరు సమర్పించవచ్చన్నారు. దరఖాస్తు, ధ్రువీకరణ పత్రాల్లో అనుమానం వస్తే సిబ్బందే దరఖాస్తుదారుడి ఇంటికి వెళ్లి పరిశీలించాలని, వారికి కార్యాలయానికి రమ్మనవద్దని తెలిపారు.