సలహాల కోసం జగన్‌ ఖర్చు.. రూ. 680 కోట్లు?

Chakravarthi Kalyan
జగన్ తన ఐదేళ్ల పాలనలో సలహాల కోసమే రూ.680 కోట్ల ప్రజాధనం ఖర్చు చేశారట. ఆ స్థాయిలో సలహాదారులను ఆయన నియమించుకున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. తన ప్రభుత్వంలో ఎంతమంది సలహాదారులు ఉన్నది ముఖ్యమంత్రికి కూడా తెలియదని... అసలు ఎవరి మాట పట్టించుకోని  ముఖ్యమంత్రి కనీసం పాలనలో ఒక్క విలేకరుల సమావేశం కూడా నిర్వహించని ముఖ్యమంత్రి సలహాదారుల నుంచి ఏం సలహాలు తీసుకున్నారో ప్రజలకు తెలియాలని విపక్షాలు నిలదీస్తున్నాయి.

సలహాదారులు ఇచ్చే సలహాలను సీఎం నిజంగా తీసుకుని అమలు చేస్తున్నారా అని జనసేన నేత నాదెండ్ల మనోహర్ నిలదీశారు. ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు కల్పించకుండా ఐబీ సిలబస్ అమలు అంటున్నారని.. ఏ సలహాదారు చెబితే ఈ విద్యా విధానంలో మార్పు తెచ్చారని.. ఈ సలహాదారుల వల్ల ప్రజలకు, రాష్ట్రానికి జరిగిన మేలు ఏంటో ప్రభుత్వం చెప్పగలదా అని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: