రామోజీ వద్ద ఆ టీడీపీ నేత బ్రోకర్ పని చేశారా?
టీడీపీ పాలనలో కాల్వ శ్రీనివాస్ వందల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డాడన్న ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి .. రామోజీరావు వద్ద కాల్వ శ్రీనివాస్ బ్రోకర్ పని చేశాడంటూ దుయ్యబట్టారు. సీఎం వైయస్ జగన్ సహకారంతో రాయదుర్గం నియోజకవర్గం సమగ్ర అభివృద్ధికి కృషి చేశానని ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి అన్నారు. 45 గ్రామాలకు తారు రోడ్లు వేయించానని, 58 చెరువులకు నీటి సరఫరాకు చర్యలు చేపట్టామని ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి చెబుతున్నారు.