శ్వేతపత్రాల పేరుతో కాంగ్రెస్‌ బోల్తా కొట్టిందా?

Chakravarthi Kalyan
ప్రభుత్వం ఆర్థిక శ్వేత పత్రాల పేరుతో ఏదో చేయబోయి బొక్క బోర్లా పడిందని బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి విమర్శించారు. నిన్న విద్యుత్ శ్వేత పత్రం చర్చలో ప్రభుత్వం పారిపోయిందన్న బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి.. కేసీఆర్ పాలనలో విద్యుత్ రంగంలో అనేక విజయాలు సాధించామన్నారు. వ్యవసాయ రంగానికి ఇరువై నాలుగు గంటల విద్యుత్ ఇచ్చామని.. ప్రభుత్వం అసెంబ్లీలో భయ పెట్టించే ప్రయత్నం చేసిందని.. మంత్రుల మధ్య సమన్వయం లేదని జగదీశ్వర్ రెడ్డి అన్నారు.

కాంగ్రెస్ సభ్యులతో దాడులు చేయించే ప్రయత్నం చేశారన్న జగదీశ్వర్ రెడ్డి.. శాసన సభలో లేని వ్యక్తుల గురించి మాట్లాడారని.. ఇచ్చిన హామీల నుంచి తప్పించుకునేందుకు శ్వేత పత్రం పేరుతో ప్రభుత్వం డ్రామాలు ఆడిందని విమర్శించారు. కార్పొరేషన్ల అప్పులు కార్పొరేషన్లు తీర్చుకుంటాయన్న జగదీశ్వర్ రెడ్డి.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మూడు గంటల కంటే ఎక్కువ ఇవ్వడం లేదని.. బీఆర్ఎస్ 24గంటల కరెంట్ ఇచ్చిందని కడుపు మంటగా ఉందని మండిపడ్డారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: