జగన్పై ఈసీకి ఫిర్యాదు చేయనున్న చంద్రబాబు?
ఇటీవలి కాలంలో ఎన్నికల జాబితాల రూపకల్పనలో వైసీపీ అక్రమాలకు పాల్పడుతోందని టీడీపీ తరచూ ఆరోపిస్తోంది. ఈ మేరకు కొన్ని చోట్ల ఆధారాలతో నిరూపించే ప్రయత్నం చేసింది. ఈసీకి కూడా కంప్లయింట్ చేసింది. దానిపై ఈసీ కూడా చర్యలు తీసుకుంది. అయితే అప్పటికీ అక్రమాలు ఆగడం లేదని.. ఇవి పెద్ద ఎత్తున జరుగుతున్నాయని.. వాటిని ఉపేక్షిస్తే మొదటికే మోసం వస్తుందని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే స్వయంగా వెళ్లి ఫిర్యాదు చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు.