జగన్‌పై ఈసీకి ఫిర్యాదు చేయనున్న చంద్రబాబు?

Chakravarthi Kalyan
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు. రాష్ట్రంలో జరుగుతున్న ఓట్ల అక్రమాలపై దిల్లీ వెళ్లి సీఈసీని కలవాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఓటమి భయంతో జగన్మోహన్ రెడ్డి దొంగ ఓట్లు చేర్పించటం, తెలుగుదేశం సానుభూతి పరుల ఓట్లు తీసేయటం వంటి చర్యలకు పాల్పడుతున్నాడని సీఈసీ దృష్టికి తీసుకెళ్లాలని చంద్రబాబు నిర్ణయించారు.

ఇటీవలి కాలంలో ఎన్నికల జాబితాల రూపకల్పనలో వైసీపీ అక్రమాలకు పాల్పడుతోందని టీడీపీ తరచూ ఆరోపిస్తోంది. ఈ మేరకు కొన్ని చోట్ల ఆధారాలతో నిరూపించే ప్రయత్నం చేసింది. ఈసీకి కూడా కంప్లయింట్ చేసింది. దానిపై ఈసీ కూడా చర్యలు తీసుకుంది. అయితే అప్పటికీ అక్రమాలు ఆగడం లేదని.. ఇవి పెద్ద ఎత్తున జరుగుతున్నాయని.. వాటిని ఉపేక్షిస్తే మొదటికే మోసం వస్తుందని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే స్వయంగా వెళ్లి ఫిర్యాదు చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: