టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎందుకైందో సీక్రెట్ చెప్పిన అమిత్షా?
కేసీఆర్.. గతంలో తెలంగాణ విమోచన దినోత్సవం ఏర్పాటు చేయాలని చెప్పి ఇప్పుడు మాత్రం నిర్వహించడం లేదని అమిత్ షా ఆరోపించారు. కేవలం ఒవైసీకి భయపడి కేసీఆర్ వాటిని నిర్వహించడం లేదు అమిత్ షా అన్నారు. కుటుంబ పాలనకు కేసీఆర్ పరిమితమయ్యారని.. కేటీఆర్ ను సీఎం చేయడమే లక్ష్యంగా ఆయన పనిచేస్తున్నారని అమిత్ షా అన్నారు. నీళ్లు, నిధులు, నియమకాల పేరిట తెలంగాణ ఏర్పాటు కోసం పోరాడితే.. అవి అమలు కాలేదన్నారు.