కాంగ్రెస్‌ గెలిస్తే ఐటీ ఇండస్ట్రీ కర్ణాటకకు వెళ్లిపోతుందా?

Chakravarthi Kalyan
కాంగ్రెస్ వస్తే ఐటీ పరిశ్రమ కర్ణాటకకు తరలిపోతుందని మంత్రి హరీశ్ రావు హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీని నమ్మితే మళ్ళీ పదేళ్లు వెనక్కి పోవాల్సి ఉంటుందన్న మంత్రి హరీశ్ రావు.. ఒకవైపు మాట తప్పే కాంగ్రెస్ మరో వైపు మాటమీద నిలబడే కేసిఆర్ ఉన్నాడన్నారు. కాంగ్రెస్ వాళ్లకు టిక్కెట్ కావాలంటే కర్ణాటక వాళ్లు కావాలి, ప్రచారం చేయాలంటే కర్ణాటక వాళ్లు కావాలి,డబ్బులు వాళ్ళే ఇవ్వాలిని.. తెలంగాణ నీటి వాట దక్కాలంటే కేసిఆర్ రావాలని మంత్రి హరీశ్ రావు అన్నారు.


గిరిజనులు తాగు నీరు లేకుండా ఇబ్బందులు పడ్డ రోజులు ఉన్నాయన్న మంత్రి హరీశ్ రావు..ఇప్పుడు మారు మూల ప్రాంతాల్లో తాగు నీరు ఇస్తున్నామన్నారు. 2009 మేనిఫెస్టో లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తండాలను పంచాయతీలుగా మారుస్తాం అని మాట తప్పిందని మంత్రి హరీశ్ రావు గుర్తు చేశారు. కానీ బీ.ఆర్.ఎస్ తండాలను గ్రామ పంచాయతీలు చేసి చూపెట్టిందని.. 4లక్షల ఎకరాలకు పైగా బీ.అర్.ఎస్ ప్రభుత్వం పోడు భూములు ఇచ్చిందని.. ఎస్సీ,ఎస్టీ రెసిడెన్సీ కళాశాలను, విదేశాల్లో చదువుకునేందుకు ఓవర్సీస్ లో రూ.20లక్షలు అందించిందని మంత్రి హరీశ్ రావు అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

it

సంబంధిత వార్తలు: