కాంగ్రెస్ గెలిస్తే ఐటీ ఇండస్ట్రీ కర్ణాటకకు వెళ్లిపోతుందా?
గిరిజనులు తాగు నీరు లేకుండా ఇబ్బందులు పడ్డ రోజులు ఉన్నాయన్న మంత్రి హరీశ్ రావు..ఇప్పుడు మారు మూల ప్రాంతాల్లో తాగు నీరు ఇస్తున్నామన్నారు. 2009 మేనిఫెస్టో లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తండాలను పంచాయతీలుగా మారుస్తాం అని మాట తప్పిందని మంత్రి హరీశ్ రావు గుర్తు చేశారు. కానీ బీ.ఆర్.ఎస్ తండాలను గ్రామ పంచాయతీలు చేసి చూపెట్టిందని.. 4లక్షల ఎకరాలకు పైగా బీ.అర్.ఎస్ ప్రభుత్వం పోడు భూములు ఇచ్చిందని.. ఎస్సీ,ఎస్టీ రెసిడెన్సీ కళాశాలను, విదేశాల్లో చదువుకునేందుకు ఓవర్సీస్ లో రూ.20లక్షలు అందించిందని మంత్రి హరీశ్ రావు అన్నారు.