కాంగ్రెస్‌ లీడర్లపై కేసీఆర్‌ పోలీసులను ప్రయోగిస్తున్నారా?

Chakravarthi Kalyan
శాసనసభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై గతంలో ఎలాంటి కేసులు లేకపోయినా పోలీస్ స్టేషన్లకు పిలిపించి పోలీసులు వేధిస్తున్నారని ఆ పార్టీ ఆరోపిస్తోంది. ఈమేరకు సీనియర్ నేత, ఎలక్షన్ కమిషన్ కో-ఆర్డినేషన్ కమిటీ ఛైర్మన్ జి.నిరంజన్‌ హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ను కలిసి పలు అంశాలపై ఆయన ఫిర్యాదు చేశారు. తెలంగాణ రాష్ట్రం నలుమూలల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి తమకు అనేక ఫిర్యాదులు వస్తున్నాయని జి.నిరంజన్‌ అన్నారు.

కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఎవరూ గుమికూడొద్దని సంబంధిత కరీంనగర్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆదేశాలు ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోందంటూ సీఈఓ ఎదుట జి.నిరంజన్‌ ప్రస్తావించారు. ఎన్నికల సమయంలో జిల్లాకు చెందిన నాయకులు, కార్యకర్తలు సంప్రదింపుల కోసం డీసీసీ కార్యాలయానికి వచ్చి ఎన్నికల అవసరాల కోసం పార్టీ అందించిన ప్రింటెడ్ మెటీరియల్‌ను పొందుతున్న సమయంలో ఈ బెదిరింపులు తగదని జి.నిరంజన్‌ చెప్పారు. ఇలాంటి వేధింపులు నివారించేందుకు తక్షణమే కరీంనగర్ జిల్లా ఎన్నికల అధికారి, సీపీకి ఆదేశాలు ఇవ్వాలని జి.నిరంజన్‌ సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: