రేవంత్‌.. 65 సీట్లు రూ. 600 కోట్లకు అమ్మేశారా?

Chakravarthi Kalyan
కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ప్రకటించిన 100 సీట్లలో దాదాపు 45సీట్లకు పైగా... ప్యారాచూట్ లకు టికెట్లు రేవంత్ రెడ్డి అమ్ముకున్నాడని డాక్టర్ కురువ విజయ్ కుమార్ ఆరోపించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హటావ్-కాంగ్రెస్ బచావ్ పేరిట... ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నాయకుడు డాక్టర్ విజయ్ కుమార్ వాల్‌ పోస్టర్ ఆవిష్కరించారు. స్పష్టమైన ఆధారాలతో మేము పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్ళామని... వివిధ రూపాల్లో నిరసన  తెలియజేశామని కురువ విజయ్ కుమార్ అన్నారు.
రేవంత్ రెడ్డి టికెట్లు అమ్ముకొని... నిజమైన కార్యకర్తలకు అన్యాయం చేశాడని కురువ విజయ్ కుమార్ మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేయడానికి  రేవంత్ రెడ్డి హఠావో కాంగ్రెస్ బచావో అనే వాల్ పోస్టర్ ను విడుదల చేస్తున్నామని కురువ విజయ్ కుమార్ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ నుండి వచ్చిన వారికి వ్యాపార వేత్తలకు కోట్ల రూపాయలు డబ్బులు తీసుకోని టికెట్స్ అమ్ముకున్నాడని కురువ విజయ్ కుమార్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: