మోడీ సంచలన నిర్ణయం.. వాళ్లకు 33% రిజర్వేషన్లు?
ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. మహిళా రిజర్వేషన్ డిమాండ్ను మోదీ ప్రభుత్వం నెరవేరుస్తుందని.. మహిళా రిజర్వేషన్ డిమాండ్ను నెరవేర్చే ధైర్యం మోదీ ప్రభుత్వానికే ఉందని కేంద్రమంత్రి అన్నారు. మంత్రివర్గ ఆమోదంతో ఇది మరోసారి రుజువైందని కేంద్ర మంత్రి అన్నారు. ఈ బిల్లును ఆమోదించిన మోదీ ప్రభుత్వానికి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ బిల్లు పాస్ అయితే లోక్సభ, రాష్ట్రాల శాసన సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు లభిస్తాయి.